‘ప్రజాసాధికార సర్వేకు ప్రజలు సహకరించాలి’
Published Wednesday, 27 July 2016జరుగుమల్లి, జూలై 26: ప్రజాసాధికార సర్వేకు మండల ప్రజలు సహకరించాలని డిటి బాలకిషోర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కె బిట్రగుంట గ్రామంలో జరుగుతున్న ప్రజాసాధికార సర్వేను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రారంభంలో కొంత జాప్యం జరిగినప్పటికీ ప్రస్తుతం రెండు రోజులుగా సర్వర్ బాగా పనిచేయడంతో ప్రజాసాధికార సర్వే వేగవంతంగా జరుగుతోందన్నారు. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలను ప్రజలు తెలియజేయాలని ఆయన కోరారు. ఆయనతోపాటు విఆర్ఓ రోశయ్య, శివాజి, వై కిరణ్ తదితరులు పాల్గొన్నారు.