S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యుదాఘాతంతో అంధవిద్యార్థి మృతి

చీమకుర్తి, జూలై 26 : చీమకుర్తి పట్టణం జవహర్ హాస్పిటల్‌లోని అంధుల హాస్టల్‌లో గుంటూరు కిట్టు (16) అనే విద్యార్థి కరెంటు తీగ తగిలి మృతిచెందిన సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చీమకుర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజిలో గుంటూరు కిట్టు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజిలోని క్లాస్‌రూంలో కరెంటు బోర్డు పక్కన కూర్చొని ఉన్నాడు. అయితే అంధుడు కావడంతో గమనించకుండా కరెంటుబోర్డును పట్టుకోవటంతో విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. కిట్టు మృతిచెందిన సమాచారం తెలుసుకొని బంధువులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. చీమకుర్తి ఎస్‌ఐ సుబ్బరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి బంధువులు, విద్యార్థులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన కిట్టుది చీమకుర్తి మండలంలోని కూనంనేనివారిపాలెం గ్రామం. దీంతో ఆ గ్రామస్థులు, బంధువులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా సంఘటన నిజనిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.