చేనేత బంధు ప్రగడకు ఘన నివాళి
Published Wednesday, 27 July 2016పొన్నూరు, జూలై 26: చేనేత పరిశ్రమ అభివృద్ధికి నేతన్న సమస్యల పరిష్కారానికి తుదిశ్వాస విడిచే వరకు పోరాటం సాగించి అమరుడై చేనేత బంధువుగా జగద్విఖ్యాతి గాంచిన ప్రగడకోటయ్య చిరస్మరణీయులని పలువురు వైసిపి నేతలు కొనియాడారు. దివంగత ప్రగడ జయంతి సందర్భంగా స్థానిక వీవర్స్ కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 11 నూల్మిల్లులు స్థాపించి వేలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపడంతో పా టు రాష్ట్రంలో అనేక కాల్వల ఏర్పాటుకు బలహీనవర్గాల గృహాల నిర్మాణానికి అవిరళ కృషిచేసిన ప్రగడ సేవలు మరువరానివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నేతలు వేణుప్రసాద్, రంగారావు, ఎస్కె సుల్తాన్, రాజారావు, షఫైతుల్లా, గేరా సంజీవ్, అల్లం సాంబయ్య, వాహెదుల్లా, మొల్లా కరీమ్లతో పాటు మునిసిపల్ కౌన్సిలర్లు న యింబాషా, మాణిక్యరావు, శివనాగరాజు, తజ్ముల్బేగ్ తదితరులు పాల్గొన్నారు.