దళిత వర్గాల సంక్షేమానికి చంద్రబాబు కృషి: రావెల
Published Wednesday, 27 July 2016మంగళగిరి, జూలై 26: దళిత వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా బడ్జెట్లో 12వేల కోట్ల రూపాయలు ఎస్సీల సంక్షేమానికి కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్బాబు అన్నారు. మండల పరిధిలోని పెదవడ్లపూడిలో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గంజి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి రావెల కిషోర్బాబు మాట్లాడారు. కమ్యూనిటీ భవనానికి అవసరమైన నిధులు కేటాయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి పురపాలకసంఘంలో ఎస్సీ కాలనీల అభివృద్ధి కూడా 6 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్బాబు ప్రకటించారు. క్రీస్తు రూపాంతర లూథరన్ చర్చి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ఆరుద్ర భూలక్ష్మి, వైస్చైర్మన్ మనె్నం రమేష్, చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, జడ్పిటిసి మెంబర్ ఆకుల జయసత్య, మండల టిడిపి అధ్యక్షుడు చావలి ఉల్లయ్య, బొక్కా నరసింహారావు, సంధ్యారాణి, అనే్న శేషారావు, గ్రామసర్పంచ్ చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అనే్న చంద్రశేఖర్, జవ్వాది కిరణ్చంద్, గోవాడ రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు.