ప్రైవేట్ బస్లో మంటలు: ముగ్గురు సజీవదహనం
Published Wednesday, 27 July 2016బెంగళూరు : బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మంటల్లో చిక్కుకుని మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణిస్తున్నారు.