రాజ్యసభలో విపక్షాల ఆందోళన
Published Wednesday, 27 July 2016ఢిల్లీ: ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నినాదాలు చేస్తూ బుధవారం విపక్షాల ఎంపీలు రాజ్యసభలో పోడియం వద్దకు దూసుకెళ్లారు. మధ్యప్రదేశ్లో దళితులపై దాడి అంశంపై సభ దద్దరిల్లింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానమిస్తూ.. దేశంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా సమర్థించబోం అని స్పష్టం చేశారు.