మంటల్లో దగ్ధమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
Published Wednesday, 27 July 2016ఒంగోలు: హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన ఎసి స్లీపర్ బస్సు బుధవారం ఉదయం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఓ లారీని ఢీకొన్న బస్సులో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్ సహా ప్రయాణికులంతా బయటకు పరుగులు తీశారు. క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో 23 మంది ప్రయాణీకులు క్షేమంగా బతికి బయటపడగా వారి లగేజీ మాత్రం కాలిపోయింది.