ఒంటిమిట్ట ఆలయంలో త్వరలో నిత్యాన్నదానం
Published Wednesday, 27 July 2016కడప: రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన ఒంటిమిట్ట కోదండరామాలయంలో త్వరలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభిస్తామని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన బుధవారం నాడు ఒంటిమిట్టలో ఆధునిక వసతులతో నిర్మించే సత్రానికి శంకుస్థాపన చేశారు.