వివాహిత అనుమానాస్పద మృతి
Published Wednesday, 27 July 2016హైదరాబాద్: ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మరణించగా, పోలీసుల తీరుపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ రాజ్కాలనీలో హరిణి అనే గృహిణి మంగళవారం అర్ధరాత్రి మరణించింది. ఆమెను అత్తింటివారే చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని చూసేందుకు తమను అనుమతించక పోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.