ఎంసెట్-2 లేకేజీలో అనుమానితుడి అరెస్టు
Published Wednesday, 27 July 2016ఒంగోలు: తెలంగాణలో ఎంసెట్-2 పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న అనుమానంతో ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుతుర్ల ఖాసిం అనే వ్యక్తిని తెలంగాణ సిఐడి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరో నిందితుడి సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా ఖాసింను పోలీసులు అనుమానించారు. రెండురోజులుగా కనిగిరిలో సిఐడి అధికారులు మకాం వేసి ఖాసిం ఆచూకీని కనుగొన్నారు.