శ్రీవారి మొబైల్ హుండీలో రూ.50వేలు చోరీ!
Published Wednesday, 27 July 2016తిరుమల: తిరుమలలో శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించే మొబైల్ హుండీ నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అర్జున్ అనే వ్యక్తి రూ.50వేలు కాజేశాడు . నిందితుడిని తిరుమల క్రైం పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల ద్వారా చోరీని గుర్తించిన తితిదే విజెలెన్స్ విభాగం అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.