విద్యార్థులపై కాలేజీ చైర్మన్ దాడి
Published Wednesday, 27 July 2016నల్గొండ: ప్రైవేటు విద్యాసంస్థల్లో అరాచకాలను అరికట్టాలని ఎబివిపి ఆధ్వర్యంలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై ఓ ప్రైవేటు కాలేజీ చైర్మన్ చేయి చేసుకోవడంతో హుజూర్నగర్లో బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తమపై దాడి చేసిన కాలేజీ చైర్మన్పై చర్య తీసుకోవాలని విద్యార్థులు ధర్నా ప్రారంభించగా వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. కొంతమంది బిజెపి, ఎబివిపి నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.