ప్రధాని మోదీ దళిత వ్యతిరేకి..!
Published Wednesday, 27 July 2016దిల్లీ: బిజెపి పాలిత రాష్ట్రాల్లో గోసంరక్షణ ముసుగులో దళితులపై దాడులు మితిమీరిపోతున్నాయని రాజ్యసభలో బుధవారం బిఎస్పి సభ్యులు ఆరోపించారు. మధ్యప్రదేశ్లో గోమాంసం తీసుకువెళుతున్నారన్న నెపంతో ఇద్దరు దళిత మహిళలను గోసంరక్షణ కార్యకర్తలు చితకబాదడం దారుణమని బిఎస్పి ఎంపీలు అన్నారు. పోడియం వద్దకు వారు చేరుకుని ప్రధాని మోదీ దళిత వ్యతిరేకి అంటూ నినాదాలు చేశారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ సభ్యులు మద్దతు పలికారు. గోసంరక్షణకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో దళితులపై దాడులు చేయడం సమర్ధనీయం కాదని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ అన్నారు.