భూములిచ్చేందుకు రైతుల అంగీకారం
Published Wednesday, 27 July 2016మెదక్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చేందుకు పల్లెపహాడ్ గ్రామస్థులు ముందుకొచ్చారు. గజ్వేల్లో పల్లెపహాడ్ రైతులు, గ్రామస్థులతో మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, కలెక్టర్ రొనాల్డ్రోస్ చర్చలు బుధవారం జరిపారు. మంత్రి హామీతో ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు పల్లెపహాడ్ రైతులు అంగీకారం తెలిపారు. స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన పల్లెపహాడ్ వాసుల త్యాగం వెలకట్టలేనిదని హరీశ్రావు అన్నారు.