సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ బదిలీ
Published Wednesday, 27 July 2016విజయవాడ: సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. నలుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా శ్రీకాంత్, సీఆర్డీఏ కమిషనర్గా గుంటూరు జేసీ శ్రీధర్, విశాఖ ఈపీడీసీఎల్ సీఎండీగా ఎంఎం నాయక్, విజయనగరం కలెక్టర్గా వివేక్ యాదవ్ను బదిలీ చేశారు.