ఇద్దరు బడా ఎర్రస్మగ్లర్ల అరెస్టు
Published Wednesday, 27 July 2016కడప: కడప జిల్లా పోలీసులు బుధవారం ఇద్దరు పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి 26 దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. సినీనటి నీతూ అగర్వాల్ భర్త, కర్నూలు జిల్లాకు చెందిన స్మగ్లర్ మస్తాన్వలీని, చిత్తూరు జిల్లాకు చెందిన మరో బడా స్మగ్లర్ భాస్కర్ను అరెస్టు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లతో ఈ ఇద్దరికీ సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.