యాక్షన్ ఎంటర్టైనర్ ఇజం
Published Wednesday, 27 July 2016కళ్యాణ్రామ్ కథానాయకుడిగా నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రం ‘ఇజం’. దీనికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్లో నాన్స్టాప్గా జరుగుతోంది. ఆగస్టు 9 నుంచి నెలాఖరువరకు స్పెయిన్లో భారీ షెడ్యూల్ జరుగుతుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్రామ్ మాట్లాడుతూ, ‘పూరితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, పూరితో చేస్తున్న ‘ఇజం’ చిత్రం మరో ఎత్తు. ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- ‘ఈ చిత్రంలో కళ్యాణ్రామ్ జర్నలిస్టుగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు. అతని కెరీర్లో ఇదో డిఫరెంట్ మూవీ అవుతుంది. డైరెక్టర్గా నాకు ఓ పవర్ఫుల్ సినిమా ఇది’ అన్నారు.
అతిథి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, అలీ, ఈశ్వరీరావు, వెనె్నల కిషోర్, బండ రఘు, అజయ్ ఘోష్, శ్రీకాంత్, కోటేష్ మాధవ, నయన (ముంబై) రవి (ముంబై) తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం:అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ:ముఖేష్, ఎడిటింగ్:జునైద్, పాటలు:్భస్కరభట్ల, ఫైట్స్:వెంకట్, ఆర్ట్:జానీ, కోడైరెక్టర్:గురు, నిర్మాత:నందమూరి కళ్యాణ్రామ్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.