నేర్చుకుందాం
Published Wednesday, 27 July 2016చ. ‘గొనకొని వీఁడు నీకును శకుంతలకుం మ్రియనందనుండు; సే
కొని భరియింపు మీతని ; శకుంతల సత్యు పల్కె సాధ్వి స
ద్వినుత మహాపతివ్రత వివేకముతో ’ నని దివ్యవాణి దా
వినిచె ధరాధినాథునకు విస్మయ మదఁగ ఁ దత్వభావనదుల్
భావం: దుష్యంతుని నిరాకరణతో ఎంతో దుఃఖించి వ్యధ చెంది ఎడతెరిపి లేకుండా కారే కన్నీళ్లను అప్పుడప్పుడు తన చీరచెంగుతో ఇకపై నాకు దైవమే శరణ్యమని భావించి, ఆ ఉత్తమ పతివ్రత కొడుకును వెంట బెట్టుకొని తిరిగిపోబోతున్న సమయంలో ఉన్నట్టుండి ‘‘ఈ భరతుడు నీకూ శకుంతలకూ మిక్కిలి ముద్దుబిడ్డడు. ఈతనిని స్వీకరించి, పోషింపుము; ఇల్లాలు, ఉత్తమ కీర్తి కలిగింది, మహాపతివ్రత అయిన శకుంతల వివేకంతో నిజం చెప్పింది’’ అని ఆ సభలో వారు విని ఆశ్చర్యపడేటట్లు గా రాజుకు వినిపించింది. ఈవిధంగా శకుంతల పాతివ్రత్యాన్ని గురించి భరతుడి పుట్టుకను గురించి మిక్కిలి సంతోషంతో కీర్తించే దేవతల మాటలు, విస్పష్టంగా ఆకాశం నుండి వెలువడగా దుష్యంతుడు విని సభాసదులను చూచి ఆశ్చర్యానందాలను ప్రకటిస్తూ మాట్లాడాలనుకొన్నాడు.
శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము