లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
Published Thursday, 28 July 2016ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభయ్యాయి. సెన్సెక్స్ 28,108 పాయింట్ల వద్ద నిఫ్టీ 8,636 వద్ద స్టార్ట్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో11 శాతం వాల్యూమ్ వృద్ధి సాధించిన ఏషియన్ పెయింట్స్ భారీగా లాభపడుతుండగా బుధవారం ఫలితాలను ప్రకటించిన భారతి ఎయిర్ టెల్, మారుతి సుజుకి కూడా లాభాలనార్జిస్తున్నాయి. బ్యాంకింగ్, ఆయల్ అండ్ గ్యాస్, ఫార్మా సెక్టార్ కుకొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.