హైకోర్టు విభజన కేసు ధర్మాసనానికి బదిలీ
Published Thursday, 28 July 2016హైదరాబాద్: హైకోర్టు విభజన కేసు విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రభుత్వ రివ్యూ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. హైదరాబాద్లోనే రెండు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ తన పిటిషన్లో కోరింది. కేసును విచారించిన డివిజన్ బెంచ్ విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటన చేసింది.