S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పాక్‌లో సార్క్ సదస్సుకు రాజ్‌నాథ్

దిల్లీ: కాశ్మీర్‌లో అల్లర్ల నేపథ్యంలో భారత్, పాక్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగిన వేళ హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్ వెళుతున్నారు. వచ్చేనెల 3,4 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ దేశాల ప్రతినిధుల సదస్సుకు ఆయన హాజరవుతున్నారు. కాశ్మీర్‌లో ఇటీవల హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భద్రతాదళాలు హతమార్చిన అనంతరం శాంతిభద్రతలు అదుపుతప్పిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లను ఎగదోసేలా పాక్ నేతలు వ్యవహరించారు. ఉగ్రవాది బుర్హాన్‌ను స్వాతంత్య్ర సమరయోధుడిగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించడంతో ఇరుదేశాల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి.