ఎంసెట్-2 లీక్ నిందితులపై చర్యలు ఖాయం
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్కు సంబంధించి నిందితులపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలంగాణ విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి గురువారం తెలిపారు. ఈ ఉదంతంపై సిఐడి పోలీసుల విచారణ ఇప్పటికే పూర్తయిందని, మెరిట్ విద్యార్థులకు నష్టం కలగకుండా తగు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా, వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాక తాను స్పందిస్తానని ఆయన అన్నారు.