ఇండిగో విమానంలో ప్రయాణికుడి బీభత్సం
Published Thursday, 28 July 2016ముంబయి: ఓ ప్రయాణికుడు గందరగోళం సృష్టించడంతో గురువారం దుబాయ్ నుంచి కోజికోడ్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. ఆ ప్రయాణికుడు అకస్మాత్తుగా విమానసిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, ఫుడ్కార్ట్పై దూకి.. దానిపై కూర్చుని నానా బీభత్సం సృష్టించాడని, ప్రయాణికులతో వాగ్వాదానికి దిగినట్లు ఇండిగో పేర్కొంది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారమందించడంతో విమానాన్ని ముంబయి ఎయిర్పోర్టులో అత్యవసరంగా దించేశారు. ఆ ప్రయాణికుడు ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. రెండు గంటలు ఆలస్యంగా విమానం కోజికోడ్ బయలుదేరింది.