సల్మాన్ కేసు తీర్పుపై సుప్రీంకు..
Published Thursday, 28 July 2016జైపూర్ (రాజస్థాన్) : కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ నిర్దోషిగా రాజస్థాన్ హైకోర్టు తీర్పు వచ్చినా, తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాజస్థాన్ న్యాయశాఖ మంత్రి రాజేంద్ర రాథోడ్ గురువారం అన్నారు. సల్మాన్ను నిర్దోషిగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత- ఘటన సమయంలో సల్మాన్ వాహనాన్ని నడిపిన హరీశ్ దులానీ తనకు ప్రాణహాని ఉండటంతో కనబడకుండా పోయినట్లు చెప్పాడు. సల్మాన్ఖానే జింకను వేటాడారని, తనకు భద్రత కల్పిస్తే కోర్టుకు ఈ విషయాన్ని చెప్పేవాడినని హరీశ్ తెలిపాడు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు మంత్రి రాజేంద్ర రాథోడ్ వెళ్లనున్నట్లు చెప్పారు.