ఎంసెట్-2 పై రేపు కేసీఆర్ ప్రకటన..
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రకటన చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వవిద్యాలయాలపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఎంసెట్-2 పరీక్షపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది. పరీక్ష రద్దు నిర్ణయం జరిగిపోయిందని అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలుందని తెలుస్తోంది. ఎంసెట్-2 పరీక్ష రద్దు చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.