ఎంసెట్-2 లీక్లో ఓ కీలకవ్యక్తి పాత్ర!: రేవంత్
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ప్రమేయం ఉందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులే లీకేజీకి కారకులని, కొంతమంది దళారులను అరెస్టు చేసి జైలుకు పంపితే సరిపోదన్నారు. పేపర్ లీక్కు సంబంధించిన మూలాలు దిల్లీ, ముంబయిలో ఉన్నందున సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని తక్షణం పదవుల నుంచి తొలగించి సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. పేపర్ ముద్రణకు టెండర్లు పిలవకుండా, ఇంటర్ బోర్టు నిషేధించిన సంస్థకు నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు.