రేపు రాజ్యసభకు జీఎస్టీ బిల్లు
Published Thursday, 28 July 2016ఢిల్లీ : జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఒక శాతం మాన్యుఫ్యాక్చరింగ్ పన్నును ఉపసంహరణ, మొదటి ఐదేళ్ళలో రాష్ట్రాలకు సంభవించే రెవిన్యూ నష్టానికి పరిహారం చెల్లింపు వంటి సవరణలను కేబినెట్ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తెలిపితే లోక్సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.