ఎంసెట్-2 లీకేజీపై ఆదిలాబాద్, కరీంనగర్లో సీఐడీ విచారణ
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులకు ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంసెట్ పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంకుల్లో భారీ తేడాలు ఉండటంతో సీఐడీ దర్యాప్తు విస్తృతం చేసింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ సీఐడీ విచారణ చేస్తోంది. కాగజ్నగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గుడిహత్నూర్కు చెందిన విద్యార్థులు లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు.