ఎంసెట్-2లో రెండు సెట్ల పేపర్లు లీక్ : సీఐడీ
Published Thursday, 28 July 2016హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2లో రెండు సెట్ల పేపర్లు లీకయ్యాయని సీఐడీ గురువారం ప్రకటన చేసింది. ‘ హైదరాబాద్, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించాం. ఇప్పటివరకు విష్ణుధర్ అలియాస్ విష్ణువర్థన్, తిరుమల్ అలియాస్ తిరుమలరావును అరెస్టు చేశాం. వీరిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారు. పరీక్షకు 2, 3 రోజుల ముందు ప్రశ్నాపత్రాలు వారికి అందజేశారు. 320 ప్రశ్నలు, వాటి సమాధానాలను ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించారు. నిందితులను రేపు నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు’ అని సీఐడీ అధికారులు తెలిపారు.