ఎంసెట్-2 రద్దు చేయొద్దని సచివాలయం వద్ద ఆందోళన
Published Thursday, 28 July 2016హైదరాబాద్: ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్ష రద్దు చేస్తే వూరుకునేది లేదన్నారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే దానిని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన తప్పుకు తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు.