ప్రజాసాధికార సర్వే వేగవంతం : చంద్రబాబు
Published Thursday, 28 July 2016విజయవాడ: ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్వే తీరుతెన్నులపై ముఖ్యమంత్రి గురువారం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సేకరించిన సమాచారం కచ్చితత్వాన్ని సరిచూసుకోవాలన్నారు.