భారీ సెట్స్లో జాగ్వార్
Published Thursday, 28 July 2016నూతన కథానాయకుడు నిఖిల్కుమార్ను పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ మనవడైన నిఖిల్కుమార్ను తెలుగులో పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నామని, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా హైయాక్షన్ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజింగ్, ఫైట్స్ హైలెట్గా నిలుస్తాయని తెలిపారు. జాగ్వార్ చిత్రాన్ని విదేశీ సాంకేతిక నిపుణులతో హైటెక్నికల్ వాల్యూస్తో రూపొందించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో వేయనున్న భారీ సెట్లో జరిగే షెడ్యూల్తో చిత్ర నిర్మాణం పూర్తిచేస్తామని, ఈ సంవత్సరంలో ఓ సెనే్సషనల్ హిట్గా సినిమా నిలుస్తుందని వారు తెలిపారు. జగపతిబాబు నటించే పాత్ర కీలకంగా వుంటుందని అన్నారు.