ఫిల్టర్బెడ్ను పరిశీలించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ
Published Thursday, 28 July 2016బాసర, జూలై 28: బాసర గ్రామానికి, ఆలయానికి తాగునీరు అందించే ఫిల్టర్బెడ్ను గురువారం జిల్లా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేష్గౌడ్ పరిశీలించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నా గ్రామానికి, ఆలయానికి తాగునీరు సరఫరా కావడం లేదని స్థానిక సర్పంచ్ శైలజా సతీశ్వర్రావు ఎస్ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 31 నుండి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బాసర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఫిల్టర్బెడ్ను పునరుద్దరించి తాగునీరు అందించేలా కృషిచేయాలని కోరారు. స్పందించిన ఎస్ఈ మల్లేష్గౌడ్.. ఇన్చార్జి డిఈ శ్రీనివాస్ను ఫిల్టర్బెడ్ నుండి ఆలయానికి, గ్రామానికి తాగునీరు అందించేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఫిల్టర్బెడ్ ఆవరణలో మొక్కలు నాటారు.