శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు
Published Thursday, 28 July 2016జగదేవ్పూర్, జూలై 28: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అలసత్వం వహించరాదని డిఐజి అకుల్సబర్వాల్ సూచించారు. గురువారం జగదేవ్పూర్ పోలీస్స్టేషన్ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్క్వాటర్ల ముందు మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. సరిహద్దు ప్రాంతమైనందున అనునిత్యం పోలీసులు అప్రమతంగా ఉండాలని,అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి శాంతిభద్రతలకు ఆటాంకం కలుగాకుండా చర్యలు తీసుకోవాలని చేప్పారు. ఆలాగే సిఎం ఫాంహౌస్కు చేపట్టిన పోలీస్భద్రత చర్యలను, భద్రత దృష్ట్య అక్కడ ఏర్పాటు చేసిన నిఘా నేత్రల పనితీరును స్థానిక ఎస్సై వీరన్నను అడిగి తెలుసుకున్నారు. క్రైం రికార్డులను డిఐజి పరిశీలించి కేసుల నమోదులలో పారదర్శకత పాటించాలని అన్నారు. సేష్టన్కు వచ్చే బాధితులతో స్నేహబావంగా ఉండాలన్నారు. అయన వెంట గజ్వేల్ సిఐ సతీస్ తదితరులు ఉన్నారు.