మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలి
Published Thursday, 28 July 2016సుల్తానాబాద్, జూలై 28: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ అన్నారు. గురువారం మండలంలోని కొదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లిలో గల లక్ష్మినంబులాద్రి స్వామి దేవాలయం ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లోకిని కోమలత, లోక్ అదాలత్ సభ్యుడు ఆనంద రావు, అడ్వకేట్ ఆలూరి శ్రీనివాస రావు పాల్గొన్నారు.