S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అభివృద్ధి చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యలు

విజయనగరం (్ఫర్టు), జూలై 28: ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా కలెక్టరేట్‌లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గురువారం ధర్నా చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఆమ్‌ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలను అకారణంగా అరెస్టు చేయడం, అభివృద్ధికి ఆటంకం కలిగించడం బిజెపి ప్రభుత్వానికి తగదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేయడం, కక్ష సాధింపుచర్యలకు పాల్పడం సరైన పద్ధతి కాదని చెప్పారు. ఇలాంటి తప్పుడు విధానాలను మానుకోకపోతే బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సిటీ కన్వీనర్ శీర స్వామినాయుడు, కో-కన్వీనర్ ఎంబి అప్పారావుదొర, బి.పైడిరాజు పాల్గొన్నారు.