కలెక్టర్ను సన్మానించిన పోలీసు అధికారులు
Published Friday, 29 July 2016విజయనగరం, జూలై 28: జిల్లానుంచి బదిలీపై వెళుతున్న కలెక్టర్ ఎంఎం నాయక్ను జిల్లా పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాళిదాసు, అదనపు ఎస్పీలు అప్పలనాయుడు, రమణ, ఇతర పోలీసు అధికారులు కలెక్టర్ నాయక్ను పూలమాలలతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ, పోలీసు శాఖల మధ్య మంచి సంబంధాలు ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలిగామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం నిర్వహించిన సర్వే సందర్భంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరించిందన్నారు. సమావేశంలో ఎస్పీ కాళిదాసు మాట్లాడుతూ కలెక్టర్ ఎంఎం నాయక్ జిల్లాకు విలువైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు త్రినాథ్, రమణ, హనుమంతు,సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.