మావుళ్లమ్మను దర్శించుకున్న ఎక్సైజ్ డైరెక్టర్
Published Friday, 29 July 2016భీమవరం, జూలై 28: భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ చంద్రశేఖర్ నాయుడు గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో చంద్రశేఖర్ నాయుడును ఆలయ ఎసి నల్లం సూర్యచక్రధరరావు, ధర్మకర్త ఎస్. చంద్రశేఖర్ సత్కరించారు. ఆయన వెంట భీమవరం ఎక్సైజ్ సిఐలు బలరామరాజు, ప్రభ తదితరులున్నారు.