S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ముగ్గురి ఆత్మహత్యాయత్నం

కమలాపురం, జూలై 28: పిల్లలకు నయం కాని నరాల బలహీనత వ్యాధి సంక్రమించడంతో చిన్నారులతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మండలం సంబటూరు గ్రామసమీపంలో కుంట ఆంజనేయస్వామి ఆలయంవద్ద గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందిన తండ్రితో సహా పిల్లలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళ్తే...ప్రొద్దుటూరుకు చెందిన చంద్రమోహన్‌రెడ్డి (45) తన కుమారుడు మంజునాథరెడ్డి (15), కుమార్తె హని (8)తో కలసి ద్విచక్రవాహనంలో కమలాపురం-కోగటం రోడ్డులోని కుంట ఆంజనేయస్వామి గుడివద్దకు చేరుకుని ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు తెచ్చుకున్న శీతలపానీయంలో పంటపొలాలకు వాడే విషగుళికలు కలుపుకుని సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆపస్మారకస్థితిలో ఉన్న వారిని ఆలయంవద్ద ఉన్నవారు గమనించి కమలాపురం 108 వాహనం ద్వారా చికిత్సనిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పిల్లల తండ్రి చంద్రమోహన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడడంతో పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి బంధువులు తరలించారు. కాగా గతంలో కూడా పిల్లలు మంజునాథరెడ్డి, హనిలకు నరాల బలహీనతకు సంబందించిన వ్యాధి ఉండడంతో వారి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, తల్లి మరణించి పిల్లలు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారని బంధువులు తెలిపారు. ఈ నేపధ్యంలో గత కొన్నాళ్లుగా చిన్నారుల ఆరోగ్యపరిస్థితి విషమిస్తుండడంతో తండ్రి చంద్రమోహన్‌రెడ్డి పిల్లలతోకలసి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడుకూడా పిల్లల కంటే తండ్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలియడంతో సంబటూరువద్ద పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు.