మహిళ అదృశ్యంపై కేసు నమోదు
Published Friday, 29 July 2016గాలివీడు, జూలై 28:మండలంలోని గాలివీడు గ్రామం దానంరెడ్డిగారిపల్లెకు చెందిన చిన్నసింగం పద్మావతమ్మ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రెడ్డయ్య తెలిపారు. భర్త వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేశామన్నారు. ఏడాది వయసు కలిగిన కుమారున్ని తన వెంట తీసుకెళ్లిందన్నారు. ఈ సమాచారం తెలిసిన వారు లక్కిరెడ్డిపల్లె సీఐ, స్థానిక పోలీస్స్టేషన్లకు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు.