వ్యక్తి ఆత్మహత్య
Published Friday, 29 July 2016రాయచోటి, జూలై 28:రాయచోటి పట్టణ పరిధిలోని మాధవరానికి చెందిన లక్ష్మీ నరసప్ప అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ లేక బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాధవరానికి చెందిన లక్ష్మీ నరసప్పకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఇతను నాలుగు సంవత్సరాల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయి మూలపల్లెకు వెళ్లే దారిలోని ఆంజనేయస్వామి దేవస్థాన పూజారిగా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి నేను దేవుని దగ్గరకు వెళ్తానని చెబుతుండేవాడని ప్రజలు చెప్పారు. బుధవారం రాత్రి ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలోని మర్రి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రాయచోటి పట్టణ ఎస్ఐ రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.