ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
Published Friday, 29 July 2016సత్తెనపల్లి, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే కాని అభివృద్ధి పనులు జరగడంలేదని, వీరి పాలనతో ప్రజలు విసిగి పోయారని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పాలని వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. గురువారం కూడా ఆయన భృగుబండ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో, గ్రామ నాయకులతో మాట్లాడారు. గడప గడపకు తిరిగి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్మీరాన్, జిల్లా నాయకులు బాసు లింగారెడ్డి, కట్టా సాంబయ్య, కోడిరెక్క దేవదాసు, మర్రి సుందరరామిరెడ్డి, చందు సాంబశివరావు, మర్రి సుబ్బారెడ్డి, కాసు నాయకుడు కొత్తా భాస్కర్, మండల యూత్ అధ్యక్షులు కళ్ళం విజయభాస్కరరెడ్డి, పట్టణ యుత్ అధ్యక్షులు అచ్యుత శివప్రసాద్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు వల్లెం నరసింహారావు, ఆకుల హనుమంతరావు, దుగ్గి బద్రయ్య, నథానేలు, మద్దు రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.