యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు
Published Friday, 29 July 2016కాకినాడ రూరల్, జూలై 28: యాజమాన్యాల నిర్లక్ష్యంవల్లే కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శశికాంతనగర్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం (ఎంపిసి) విద్యార్థిని గెడ్డం భారతి (17) కళాశాల స్టడీ రూమ్లో గురువారం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే కళాశాలకు వెళ్లిన కన్నబాబు వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా ఉన్న నారాయణ కళాశాలలో ఇలాంటివి అనేకసార్లు జరిగాయని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా యాజమాన్యాల తీరును దుయ్యబట్టారు.