ప్రతీ ఇంట్లో ఐదు మొక్కలు నాటాలి
Published Friday, 29 July 2016కాకినాడ, జూలై 28: జిల్లాలో ఉన్న ప్రతీ ఇంటిలో తప్పనిసరిగా ఐదు మొక్కలు నాటాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం జడ్పీ కార్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. జిల్లాలో సుమారు 2 లక్షల మొక్కలు నాటాలని నామన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పి సిఇఓ కె పద్మ, వివిధ విభాగాల పర్యవేక్షకులు ఆర్వివి రమేష్, ఎన్ సత్యప్రసాద్, నరేంద్రరెడ్డి, కుమార్బాబు, హరికృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.