S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య

నర్సీపట్నం, జూలై 28: కుటుంబ కలహాలు తల్లీబిడ్డను బలితీసుకుంది. రెండేళ్ళ బాబుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న కుమార్తె, మనుమడు కొద్ది గంటల వ్యవధిలోనే విగత జీవులుగా మారారు. తల్లి, బిడ్డ మృత దేహాలను చూసిన ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్థులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామానికి చెందిన మాతిరెడ్డి శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన రూపావతి(29)తో ఐదేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి గౌతమినాయుడు(3),నవీన్(2) అనే ఇద్దరు కుమారులున్నారు. శ్రీనివాస్, రూపావతిలు కొంత కాలం అన్యోన్యంగానే కాపురం సాగించారు. గత ఏడాది కాలంగా భర్త శ్రీనివాస్ భార్య రూపావతిని వేధించడం ప్రారంభించాడు. అత్తింటి నుండి అదనపు కట్నం తేవాలంటూ వత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై భార్యభర్తలిద్దరి మధ్య తగాదాలు చోటు చేసుకునేవి. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం రూపావతి అదే గ్రామంలోని పుట్టింటికి పిల్లలతో సహా వెళ్లిపోయింది. పుట్టింట్లో ఉంటుండగా బుధవారం రాత్రి అత్తవారింటికి వచ్చి బావమరిదితో శ్రీనివాస్ గొడవ పడ్డాడు. గురువారం ఉదయం రూపావతి పెద్దకుమారుడు గౌతమి నాయుడిని స్కూల్‌కు పంపించింది. మధ్యాహ్నం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న పొలం పాకల వద్దకు తన రెండేళ్ళకుమారుడు నవీన్‌తో సహా వెళ్ళింది. అక్కడ ఉన్న బావిలో బిడ్డతో సహా తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకిన శబ్దం విన్న చుట్టుపక్కల వారు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే తల్లి బిడ్డలిద్దరూ బావిలోని ఊబిలో చిక్కుకుపోయారు. అనంతరం ఇద్దరి మృత దేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. స్థానికులు మృత దేహాలను బావిలో నుండి బయటకు తీశారు. అనంతరం తల్లి, బిడ్డల మృత దేహాలకు పోస్టుమార్టం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై కుటుంబ సభ్యులెవ్వరూ నోరుమెదపడం లేదు. రూరల్ ఎస్సై ఎ.విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా ఈ సంఘటనకు సంబంధించి తమకు ఇంత వరకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. ఏరియా ఆసుపత్రి నుండి సమాచారం వస్తే దర్యాప్తు చేస్తామని తెలిపారు.