వైసిపిని వీడేది లేదు
Published Friday, 29 July 2016పాడేరు, జూలై 28: తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన తమ నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి ఎల్లవేళలా అండగా ఉంటానని, తాను ఏ ఇతర పార్టీలో చేరే ప్రసక్తే లేదని పాడే రు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి స్పష్టం చేశారు. గురువారం సాయం త్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను అధికార టిడిపిలో చేరుతున్నట్టు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్టు ఎక్కడా ఏ సందర్భంలోనూ ప్రస్తావించలేదని, తనపై కొంతమంది స్వార్థపరులు ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూడలేని వారు తప్పుడు ప్రచారం సాగించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఇటువంటి దుస్ప్రచారాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వసించవద్దని ఆమె కోరారు. తమ నాయకుడు తనను అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించడం పట్ల ఆమె జగన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అరకులోయ పార్లమెంట్ ఇన్చార్జిగా తాను నియమితులు కావడం తనపై దుస్ప్రచారాన్ని సాగిస్తున్న వారికి చెంపపెట్టు కాగలదని ఆమె అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలలో వైసీపీబలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె చెప్పారు.