మహిళలకు ప్రత్యేక బస్సు
Published Friday, 29 July 2016విశాఖపట్నం, జూలై 28: రాష్ట్రంలోనే తొలి ప్రయోగం అయిన ‘మహిళలకు ప్రత్యేక బస్సు’ గురువారం ప్రారంభమైంది. ఇది తొలి సర్వీసుగా కూర్మన్నపాలెం నుంచి ఉదయం 7.20 గంటలకు కదిలింది. బస్సు ప్రారంభంలోనే మహిళల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం 7.20 గంటలకు కూర్మన్నపాలెంలో బయలుదేరి పాత గాజువాక, ఆటోనగర్,బిహెచ్ఇఎల్, అక్కిరెడ్డిపాలెం, షీలానగర్, ఎన్ఏడి జంక్షన్, మర్రిపాలెం, కంచరపాలెంమెట్టు, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారాజంక్షన్, మద్దిలపాలెం, ఇసుకతోట, వెంకోజిపాలెం, జూపార్కు, ఎండాడ, కారుషెడ్, మధురవాడ, ఆనందపురం, తగరపువలస మీదుగా అవంతి ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటుంది. ఆ తరువాత మళ్ళీ ఇదే సర్వీసు సాయంత్రం 4.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఆయా ప్రాంతాల మీదుగా కూర్మన్నపాలేనికి రాత్రి 6.30 గంటలకు చేరుకుంటుంది.