S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కమీషన్ పెంపుపై డీలర్ల హర్షం

శ్రీకాకుళం(టౌన్), జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల రేషన్ డిపో డీలర్లకు ప్రస్తుతం అందజేస్తున్న కమీషన్‌ను మూడు రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జిల్లా డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతను వారు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో డీలర్ల ఉపాధికి భరోసా లభించిందని వారన్నారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల మాట్లాడుతూ చౌక డిపోల్లో డీలర్లు నిత్యావసర సరుకల పంపిణీలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒక క్వింటా బియ్యంపై 70 రూపాయలు కమీషన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అవకతవకలను అరికడుతూనే డీలర్లకు ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని మంత్రి అన్నారు. అయితే డీలర్లు అవకతవకలకు పాల్పడకుండా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేయాలని సూచించారు.