వర్శిటీలపై నేడు సీఎం సమీక్ష
Published Friday, 29 July 2016హైదరాబాద్, జూలై 28: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల నియామకాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మంత్రులు, న్యాయ నిపుణులు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు శుక్రవారం సమావేశం కానున్నారు. వైస్ ఛాన్స్లర్ల నియామకంపై హైకోర్టు నుంచి ఎదురైన చుక్కెదురును ఏవిధంగా అధిగమించాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశానికి వైస్ఛాన్స్లర్లను కూడా హాజరు కావల్సిందిగా సిఎం కార్యాలయం నుంచి వర్తమానం అందింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ప్రస్తుతం కొనసాగుతున్న ఇంచార్జి వైస్ ఛాన్స్లర్లు వెళ్తారా లేక తాజాగా నియామకం అయిన వారు వెళ్తారా అనేది స్పష్టం కాలేదు.