S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్ ప్రశ్నపత్రాల లీక్‌పై విద్యార్థి సంఘాల ధర్నా

కెపిహెచ్‌బి కాలనీ, జులై 28: ఎంసెట్ పరీక్షా పత్రాల లీక్‌పై పలు విద్యార్ధి సంఘాలు ఆందోళన చేస్తూ కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. గురువారం జెఎన్‌టియు ఏబివిపి ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షా పత్రాల లీక్‌పై ఎంసెట్ కన్వీనర్, కోకన్వీనర్ పాపిరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా జెఎన్‌టియు ఇన్‌చార్జి ఆనంద్ మాట్లాడుతూ ఎంసెట్ పత్రాల లీక్‌పై వెంటనే ఎంసెట్ కన్వీనర్, కోకన్వీనర్‌ను అరెస్టు చేసి విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేశారు. అలాగే మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయికుమార్, జ్యోతి, శ్రీ్ధర్, రిషి, మహేందర్, యాదగిరి, హర్షిత్‌రెడ్డి, రామకృష్ణ, గంగిరెడ్డి పాల్గొన్నారు.
బిజెవైఎం ఆధ్వర్యంలో..
కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్ యూనివర్సిటీ ముందు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలియచేశారు. రంగారెడ్డిజిల్లా బిజెవైఎమ్ కార్యదర్శి విజిత్‌వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్క బాల్‌రెడ్డిలు హాజరై ఎంసెట్ పరీక్షా పత్రాల లీక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష పత్రాలను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సంబందిత మంత్రలు రాజీనామా చేయాలన్నారు. విద్యార్ధులకు న్యాయం జరగాలని, లేనిపక్షంలో బిజెవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు హరికృష్ణ, ప్రీతంరెడ్డి, అరుణ్‌చంద్ర, నరేంధర్, వినోద్, సునీల్, విష్ణు పాల్గొన్నారు.